ప్రకాశం: వెలిగండ్ల(మం) మొగులూరుపల్లిలో ఆదివారం అక్షరాంధ్ర పరీక్ష నిర్వహించారు. మహిళలు పెద్ద ఎత్తున హాజరై పరీక్షలు రాశారు. ఈ కార్యక్రమంలో ఏపీఎం వెంకటరత్నం, డిప్యూటీ ఎంపీడీవో ఎస్.జీ.ఎస్.డబ్ల్యూ రాంప్రసాద్, వెలుగు సీసీ పాల్గొన్నారు. పరీక్ష నిర్వహణను వారు పరిశీలించి, కార్యక్రమం సజావుగా జరిగేలా చర్యలు తీసుకున్నారు.