KDP: ఒంటిమిట్ట మండలం మలకాటిపల్లి గ్రామ శివారులో వెలసిన శ్రీ వీర గంగమ్మ తల్లి వార్షిక మహోత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. ఈ సందర్భంగా వార్షిక మహోత్సవాల్లో ఆఖరి 3వ రోజు బండలాగుడు పోటీలు రసవత్తరంగా సాగనున్నాయి. ఈ పోటీలను రాజంపేట నియోజకవర్గ టీడీపీ ఇంఛార్జ్ చమర్తి జగన్మోహన్ రాజు ప్రారంభించనున్నారు. అనంతరం రాత్రికి అమ్మవారి ఊరేగింపు వైభవంగా జరగనుంది.