‘తెలుసు కదా’ సినిమా రిజల్ట్పై రాశి ఖన్నా షాకింగ్ కామెంట్స్ చేసింది. షూటింగ్ సమయంలోనే సినిమా ఫలితం ఎలా ఉండబోతుందో తనకు అర్థమైందని, కథలోని కొన్ని పాయింట్లు ప్రేక్షకులకు కనెక్ట్ కావని యూనిట్కు ముందే చెప్పానని ఆమె పేర్కొంది. డైరెక్టర్ నీరజ కోన విజన్పై నమ్మకంతోనే బాధ్యతగా నటించానని రాశి స్పష్టం చేసింది. ప్రస్తుతం ఈ వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.