MBNR: జడ్చర్ల నియోజకవర్గంలో ఆదివారం మంత్రి వాకిటి శ్రీహరి పర్యటించనున్నారు. ప్రగతి ప్రణాళిక కార్యక్రమంలో భాగంగా జడ్చర్ల ప్రభుత్వ ఆసుపత్రిలో ఉదయం 11 గంటలకు నిర్వహించే పారిశుద్ధ్య కార్యక్రమంలో మంత్రి పాల్గొననున్నారు. అనంతరం మిడ్జిల్ మండలం బోయిన్ పల్లిలో నూతనంగా నిర్మించిన 33/11కేవీ సబ్ స్టేషన్ను ప్రారంభిస్తారని ఎమ్మెల్యే అనిరుద్ రెడ్డి తెలిపారు.