GDWL: కల్తీ ఆహారం, నకిలీ ఉత్పత్తుల పట్ల ప్రతి ఒక్కరూ అప్రమత్తంగా ఉండాలి అని జిల్లా కలెక్టర్ రిజ్వాన్ బాషా అన్నారు. మార్చి 15న ప్రపంచ వినియోగదారుల హక్కుల దినోత్సవాన్ని పురస్కరించుకుని ఆసరా సంస్థ ఆధ్వర్యంలో రూపొందించిన అవగాహన గోడపత్రికలను ఆయన ఆవిష్కరించారు. అన్యాయ వ్యాపార విధానాలపై వినియోగదారులు ప్రశ్నించాలన్నారు.