KNR: జమ్మికుంట మున్సిపల్ పరిధిలోని 1, 2 వార్డులను మున్సిపల్ ఛైర్మన్ మొలుగు ప్రశాంత్ కుమార్ (దిలీప్) సందర్శించారు. ముందుగా దుబ్బ మల్లికార్జున స్వామి ఆలయం, శ్రీ పార్వతి సమేత రాజరాజేశ్వర స్వామి ఆలయాల్లో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయానికి వెళ్లే రోడ్డు దుస్థితి, లైట్లు, వైకుంఠధామం సమస్యలు, డ్రైనేజీ వంటి అంశాలను స్థానికులు తెలియజేశారు.