కర్నూలు: జిల్లా పోలీసు శిక్షణా కేంద్రంలో 203 పోలీసు ట్రైనీ కానిస్టేబుళ్లకు సీపీఆర్, ప్రథమ చికిత్సపై శనివారం అవగాహన కార్యక్రమం నిర్వహించారు. అడిషనల్ ఎస్పీ హుస్సేన్ పీరా కార్యక్రమాన్ని ప్రారంభించారు. అత్యవసర పరిస్థితుల్లో బాధితుల ప్రాణాలను రక్షించేందుకు ఈ శిక్షణ ఎంతో ఉపయోగపడుతుందని వైద్యులు తెలిపారు.