WNP: గోపాల్ పేట ఎస్సీ హాస్టల్లో టెన్త్ చదువుతున్న ఏదుట్ల గ్రామానికి చెందిన భూత భరత్ పరీక్షలపై ఆసక్తి లేక హైదరాబాద్ వెళ్లిపోయాడు. శనివారం సమాచారం అందుకున్న ఎస్సై జగన్మోహన్, టీచర్ ధర్మరాజు విద్యార్థి ఇంటికి వెళ్లి కుటుంబసభ్యులతో మాట్లాడారు. భరత్ను తిరిగి రప్పించి పరీక్షలు రాయించేందుకు అధికారులు ముమ్మర ప్రయత్నాలు చేస్తున్నట్లు తెలిపారు.