టీ20 ప్రపంచకప్లో భారత యువ ఓపెనర్ అభిషేక్ శర్మ ఫామ్ జట్టును ఆందోళనకు గురిచేస్తోంది. గత ఏడాది కాలంగా అదిరిపోయే ఆరంభాలతో జట్టును ఆదుకున్న అభిషేక్, ఇప్పుడు వరుస వైఫల్యాలతో సతమతమవుతున్నాడు. అతడి ఫామ్ లేమి జట్టు బ్యాటింగ్పై తీవ్ర ప్రభావం చూపుతోంది. రేపు సౌతాఫ్రికాతో జరగే సూపర్-8 పోరులోనైనా అభిషేక్ జట్టుకు శుభారంభం అందించాలని అభిమానులు కోరుకుంటున్నారు.