TPT: మహాకవయిత్రి మొల్ల జయంతి సందర్భంగా జిల్లా కలెక్టరేట్ సమావేశ మందిరంలో కార్యక్రమం నిర్వహించారు. జిల్లా రెవెన్యూ అధికారి నరసింహులు ఆమె చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా మొల్ల తెలుగు సాహిత్యానికి చేసిన సేవలు చిరస్మరణీయమని తెలిపారు. కార్యక్రమంలో జిల్లా విద్యాశాఖాధికారి కుమార్ సహా అధికారులు పాల్గొన్నారు.