MHBD: కేసముద్రం మున్సిపాలిటీ బ్రహ్మంగారి తండాకు చెందిన బానోత్ సీతారాం గురువారం అనారోగ్యంతో మరణించారు. ఈ విషయం తెలుసుకున్న 1వ వార్డు కౌన్సిలర్ జాటోత్ సుజాత- హరీష్ నాయక్ మృతుడి నివాసానికి వెళ్లి ఆయన పార్థివ దేహానికి పూలమాలవేసి నివాళులర్పించారు. అనంతరం బాధిత కుటుంబాన్ని పరామర్శించి ప్రగాఢ సానుభూతి తెలియజేశారు. కార్యక్రమంలో స్థానికులు ఉన్నారు.