NZB: నవీపేట్ మండల కేంద్రంలోని దర్యాపూర్ కాలనీలో దొంగతనం జరిగింది. గురువారం ఎస్సై శ్రీకాంత్ తెలిపిన వివరాల ప్రకారం.. అంకం ఆనంద్ అనే వ్యక్తి ఈ నెల 8న NZBలో తన కూతురు ఇంటికి వెళ్లాడు. బుధవారం తిరిగి వచ్చేసరికి గుర్తుతెలియని వ్యక్తులు ఇంటి తాళం పగులగొట్టి తులంన్నర బంగారం, నగదు అపహరించారన్న ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు.