ప్రకాశం: తర్లుపాడు మండలంలో రిలయన్స్ సంస్థ ఆధ్వర్యంలో బయో గ్యాస్ ప్లాంట్ ఏర్పాటుకు ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. కలుజువ్వలపాడు, మంగళకుంటలో ఇప్పటికే 733 ఎకరాల ప్రభుత్వ భూమిని సేకరించామని MRO కిషోర్ కుమార్ తెలిపారు. మరో 1,267 ఎకరాల వరకు సేకరించాలని ప్రతిపాదనలు పంపామన్నారు. చెన్నారెడ్డిపల్లి, జగన్నాథపురంతో పాటు మరో రెండు గ్రామాల్లో భూములను సేకరించాల్సి ఉందన్నారు.