TPT: శ్రీవెంకటేశ్వర యూనివర్సిటీ పరిధిలోని M.P.Ed, B.P.Ed, D.P.Ed నాలుగో సెమిస్టర్ పరీక్షలు ఏప్రిల్ 15 నుంచి 18వ తేదీ వరకు నిర్వహించనున్నట్లు వర్సిటీ పరీక్షల విభాగం నియంత్రణ అధికారి రాజమాణిక్యం తెలిపారు. పరీక్షలు ఎస్వీ ఆర్ట్స్ కాలేజ్, మదనపల్లె బీటీ కళాశాలలో ఏర్పాటు చేసిన రెండు కేంద్రాల్లో జరుగుతాయని చెప్పారు. విద్యార్థులు ఈ విషయాన్ని గమనించాలని సూచించారు.