E.G: నిడదవోలు నియోజకవర్గ వైసీపీ కార్యాలయం వద్ద పార్టీ 16వ దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా నియోజకవర్గ వైసీపీ ఇన్చార్జి, మాజీ ఎమ్మెల్యే జి.శ్రీనివాస్ నాయుడు YSR విగ్రహానికి పూలమాల వేసి, పార్టీ జెండా ఆవిష్కరించారు. అధికారం ఉన్నా లేకున్నా వైసీపీ నిరంతరం ప్రజల పక్షాన పోరాడుతామని పేర్కొన్నారు. వైసీపీ ప్రజల కోసం పుట్టిన పార్టీ అని కొనియాడారు.