MLG: ములుగు పట్టణంలో భారత్ పెట్రోలియం కార్పొరేషన్ ఆధ్వర్యంలో కేరళలోని కోచిలో గిరిజన యువతకు నైపుణ్య శిక్షణ కోసం 25 సీట్లు కేటాయించినట్లు కలెక్టర్ దివాకర ఆదివారం తెలిపారు. ఎంపికైన వారికి ఉచిత వసతి, భోజనం, యూనిఫాం అందించడంతో పాటు ఆరు నెలల శిక్షణ అనంతరం ఉపాధి అవకాశాలు కల్పిస్తామని పేర్కొన్నారు. ఈ నెల 10లోపు ఆన్లైన్ దరఖాస్తు చేసుకోవాలని సూచించారు.