BPT: ఈ నెల 9న బాపట్ల జిల్లా భట్టిప్రోలుకు ముఖ్యమంత్రి రానున్నారు. ఈ నేపథ్యంలో సూరేపల్లెలో పర్యటన ప్రాంతాలను జిల్లా కలెక్టర్ డాక్టర్ వి.వినోద్ కుమార్, జేసీ భావన వశిష్ట, ఎస్పీ ఉమామహేశ్వర్ పరిశీలించారు. భద్రత, ప్రోటోకాల్ అంశాలను పర్యవేక్షించి స్థానిక అధికారులకు కీలక ఆదేశాలు ఇచ్చారు. ఎలాంటి లోపాలు లేకుండా సీఎం పర్యటనను సమన్వయంతో విజయవంతం చేయాలన్నారు.