KRNL: రాష్ట్ర వ్యాప్తంగా ఉపాధ్యాయుల ఆర్థిక, విద్యారంగ సమస్యల పరిష్కారం కోసం ఫ్యాప్టో ఇచ్చిన పిలుపు మేరకు కర్నూలులో ఉద్యమం మరింత ఉద్ధృతమవుతోందని ఫ్యాప్టో నాయకులు తెలిపారు. ఆదివారం జిల్లా విద్యాధికారికి ఫ్యాప్టో నాయకులు ధర్నా నోటీసు అందజేశారు. మూల్యాంకనం విధుల్లో పాల్గొనే ఉపాధ్యాయులు రేపటి నుండి నల్ల బ్యాడ్జీలు ధరించి విధులకు హాజరవుతారని తెలిపారు.