CTR: రాష్ట్ర పురపాలక శాఖ మంత్రి నారాయణ సోమవారం చిత్తూరులో పర్యటిస్తారని ఎమ్మెల్యే గురజాల కార్యాలయం ఓ ప్రకటనలో తెలిపింది. ఉదయం 8:30 గంటలకు బీవి రెడ్డి కాలనీలోని ఎమ్మెల్యే నివాసానికి మంత్రి చేరుకుంటారని అందులో పేర్కొన్నారు. నియోజకవర్గ టీడీపీ నాయకులు పర్యటన విజయవంతం చేయాలని వారు కోరారు.