SKLM: సీఎం రిలీఫ్ ఫండ్ ద్వారా పేదలకు ఆర్థిక భరోసా కలుగుతుందని ఎమ్మెల్యే ఈశ్వరరావు అన్నారు. ఆదివారం తన క్యాంప్ కార్యాలయంలో ఎచ్చెర్ల నియోజకవర్గానికి చెందిన 12 మంది లబ్ధిదారులకు సీఎం రిలీఫ్ ఫండ్ ద్వారా మంజూరైన చెక్కులను పంపిణీ చేశారు. ఈ నిధులు సద్వినియోగం చేసుకోవాలని కోరారు.