ప్రకాశం: వైసీపీ 16వ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా కంభం పట్టణంలోని కందులాపురం సెంటర్లో ఉన్న మాజీ ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర్ రెడ్డి విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమంలో గిద్దలూరు వైసీపీ ఇన్ఛార్జ్ కుందూరు నాగార్జున రెడ్డి హాజరై మాట్లాడారు. వందకు వందశాతం ప్రజలకు హామీలు నెరవేర్చిన ఏకైక ప్రభుత్వం వైసీపీ ప్రభుత్వం అని అన్నారు.