GDWL: అలంపూర్ జోగులాంబ బాలబ్రహ్మేశ్వర స్వామివారి ఆలయంను ‘బలగం’ చిత్ర దర్శకుడు, సినీ నటుడు వేణు యెల్దండి శనివారం దర్శించుకున్నారు. అమ్మవారిని, స్వామివారిని దర్శించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం ఆలయ అర్చకులు ఆయనకు తీర్థప్రసాదాలు అందజేశారు. ఈ కార్యక్రమంలో దేవస్థానం సిబ్బంది సురేశ్ పాల్గొన్నారు.