సత్యసాయి: CM చంద్రబాబు అధ్యక్షతన బుధవారం నిర్వహించిన కలెక్టర్ల కాన్ఫరెన్స్లో శ్రీ సత్యసాయి జిల్లా కలెక్టర్ శ్యాం ప్రసాద్ పాల్గొన్నారు. జిల్లాలో సాగుతున్న అభివృద్ధి పనులు, ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక పురోగతిని ముఖ్యమంత్రికి వివరించారు. పేదల సంక్షేమ పథకాలు క్షేత్రస్థాయిలో అర్హులందరికీ అందేలా తీసుకుంటున్న చర్యలను వెల్లడించారు.