W.G: జిల్లా అభివృద్ధిపై సీఎం చంద్రబాబు ఆదివారం ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించారు. ఈ కార్యక్రమంలో జిల్లా ఇంఛార్జ్ మంత్రి గొట్టిపాటి రవికుమార్, కేంద్ర మంత్రి శ్రీనివాస వర్మ, మంత్రి నిమ్మల రామనాయుడు, ఎమ్మెల్యే రఘురామకృష్ణరాజు ఇతర ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు. ప్రభుత్వ సేవలు, సంక్షేమ పథకాల అమలులో ప్రజలకు ఎటువంటి ఇబ్బందులు కలగకూడదని సీఎం స్పష్టం చేశారు.