SRD: మనూరు మండలం బోరంచ నల్ల పోచమ్మ ఆలయ అభివృద్ధి కోసం దాతలు అందజేసిన 12 బారికేడ్లు చేరుకున్నాయని సిబ్బంది ఆదివారం తెలిపారు. త్వరలోనే నల్ల పోచమ్మ ఏడు వారాల మహా జాతర జరగనుంది. ప్రతి గురు, ఆదివారాల్లో వేలాది సంఖ్యలో భక్తులు అమ్మవారిని దర్శించుకుంటారు. ఆ సమయంలో భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అక్కడక్కడ ఈ భారీకేడ్లు ఏర్పాటు చేస్తామని సిబ్బంది చెప్పారు.