SDPT: బెజ్జంకి శ్రీ లక్ష్మీనరసింహస్వామి ఆలయం గుట్టపై ఉన్న పెద్ద రాతిబండపై వెలసిన కాలభైరవ స్వామి సన్నిధిలో హరిబాబు రేకుల షెడ్డు నిర్మించారు. కాలభైరవ స్వామి పునర్నిర్మాణం సందర్భంగా ఆదివారం ప్రత్యేక పూజలు ఘనంగా నిర్వహించారు. క్షేత్రపాలకుడిగా కాలభైరవుడు ఉంటాడని భక్తుల విశ్వాసం. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ చైర్మన్ ప్రభాకర్, ఒగ్గు దామోదర్ తదితరులు పాల్గొన్నారు.