GDWL: వేసవి ఉష్ణోగ్రతలను దృష్ట్యా నర్సరీల్లోని మొక్కలు ఎండిపోకుండా చర్యలు తీసుకోవాలని ఎంపీడీవో రాఘవ సూచించారు. మండల కేంద్రంలోని ఎంపీడీవో కార్యాలయ ఆవరణలో ఉన్న మొక్కలకు స్వయంగా నీళ్లు ఇచ్చారు. నాటిన మొక్కలకు క్రమం తప్పకుండా నీరు పోయాలని, పశువుల కోసం గ్రామాల్లో నీటి తొట్లు ఏర్పాటు చేయాలని అధికారులను ఆదేశించారు.