సూర్యాపేట మండలం పిన్నాయిపాలెం గ్రామ పంచాయతీలో సర్పంచ్ చింత భవాని మధు ఆధ్వర్యంలో సీ.సీ రోడ్ల నిర్మాణ పనులకు శంకుస్థాపన ఘనంగా జరిగింది. ఈ సందర్భంగా సర్పంచ్ మాట్లాడుతూ… గ్రామ అభివృద్ధిలో భాగంగా నాణ్యమైన రోడ్ల నిర్మాణానికి ప్రాధాన్యత ఇస్తున్నామని తెలిపారు. ఈ కార్యక్రమంలో వార్డు సభ్యులు, గ్రామ పెద్దలు మహిళలు పాల్గొన్నారు.