BHPL: జిల్లా మహదేవపూర్ మండలం కాళేశ్వరం గ్రామంలో ఈ ఆలయం వెలసింది. ద్రావిడ నిర్మాణ శైలిలో నిర్మించిన ఈ ఆలయానికి ఈ దేశంలో ఎక్కడాలేని విశిష్టత ఉంది. శివుడు,యముడు ఒకే పానవట్టంపై లింగాకృతిలో కలిసి ఉండటం ఈ గుడి ప్రత్యేకత. ఈ ప్రాంతం త్రివేణి సంగమం (గోదావరి, ప్రాణహిత, అంతర్వాహినిగా సరస్వతి) తీరంగా ఉంది. ఇక్కడ 12 ఏళ్లకు ఒకసారి గోదావరి, సరస్వతీ పుష్కరాలు జరుగుతాయి.