NLG: నాగార్జునసాగర్ ప్రాజెక్టు స్పిల్వే మరమ్మతులపై నీలినీడలు కమ్ముకున్నాయి. స్పిల్వేలో గుంతలు పడి బకెట్ పోర్షన్ భాగాలు దెబ్బతినడంతో ఆందోళన వ్యక్తమవుతోంది. 2011లో తాత్కాలిక మరమ్మతులు చేసినా శాశ్వత పరిష్కారం లభించలేదు. నేడు NDSA ఛైర్మన్ అనిల్ జైన్ బృందం పర్యటించనున్న నేపథ్యంలో దెబ్బతిన్న స్పిల్వేను పరిశీలించి నిధులు మంజూరు చేయాలని కోరుతున్నారు.