ప్రకాశం: దోర్నాల మండలం జమ్మి దోర్నాల క్రాస్ రోడ్ వద్ద జాతీయ రహదారిపై ఆదివారం తెల్లవారుజామున గుర్తు తెలియని వాహనం ఢీకొని ఓ వృద్ధుడు మృతి చెందాడు. మృతుడిది దోర్నాల మండలం చిన్న గుడిపాడు గ్రామానికి చెందిన ఒంటేరు ఆవులయ్యగా గుర్తించారు. మృతుడు మతిస్థిమితంలేక తిరుగుతుంటాడని సమాచారం. దీనిపై మరింత సమాచారం తెలియాల్సి ఉంది.