చిత్తూరు నగరపాలక సంస్థ పరిధిలో 49వ వార్డు కోడిగుంటపల్లిలో రూ. 20 లక్షలతో నిర్మించిన సీఆర్సీ భవన ప్రారంభోత్సవంలో ఎమ్మెల్యే గురజాల జగన్మోహన్ పాల్గొన్నారు. పూజలు నిర్వహించి రిబ్బన్ కట్ చేసి భవనాన్ని ప్రారంభించారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ.. అభివృద్ధి కూటమి ప్రభుత్వ లక్ష్యమన్నారు. ఆర్థిక ఇబ్బందులు ఉన్నా.. అభివృద్ధి, సంక్షేమ ఫలాలను ప్రజలకు అందిస్తున్నామని అన్నారు.