కృష్ణా: అవనిగడ్డ మండలం మోదుమూడిలో పొలిమేర కోడు, 1/ఏ కాలువలపై రెండు నూతన శ్లాబ్ కల్వర్టుల నిర్మాణం శనివారం ప్రారంభించారు. రూ. 4.82 కోట్లతో మోదుమూడి నుంచి మాచవరం, దక్షిణ చిరువోలులంక మీదుగా కొత్తపేట వరకూ 4.1కిలోమీటర్ల నూతన రహదారి నిర్మించారు. ఈ పనుల్లో భాగంగా కల్వర్టుల నిర్మాణం చేపట్టారు. ఈ పనులను డీసీ వైస్ ఛైర్మన్ బచ్చు రఘునాథ ప్రసాద్ పరిశీలించారు.