KDP: CM చంద్రబాబు పాలన వైఫల్యాలపై రోడ్డెక్కి నిరసన కార్యక్రమాలు చేపట్టనున్నట్లు YCP రాష్ట్ర అధికార ప్రతినిధి రాచమల్లు శివ ప్రసాద్ రెడ్డి తెలిపారు. ఆయన శనివారం ప్రొద్దుటూరులో మాట్లాడుతూ.. జూన్ 4, 8, 12 తేదీల్లో రాష్ట్రవ్యాప్త నిరసన కార్యక్రమాలు చేపట్టనున్నట్లు తెలిపారు. CBN అధికారంలోకి వచ్చి 2 సంవత్సరాలైనా ఎన్నికల వాగ్దానాలను అమలు చేయలేదన్నారు.