E.G: కడియం గ్రామ స్మశాన వాటికలో మేకలు, గొర్రెల సంచారం అధికమవడంతో పారిశుద్ధ్యం దెబ్బతిందని స్థానికులు ఆరోపిస్తున్నారు. సమీపంలోని మాంసం దుకాణాల నిర్వాహకులు వాటిని ఇక్కడకు వదలడం వల్లే ఈ పరిస్థితి ఏర్పడిందని వాపోతున్నారు. మూగజీవాల విసర్జనల కారణంగా ప్రాంగణమంతా అపరిశుభ్రంగా మారి అడుగు తీసి అడుగు వేయలేని పరిస్థితి నెలకొంది.