AKP: గంజాయి అమ్మకాలు, రవాణాపై సమాచారం ఉండి కూడా చెప్పకుండా దాచడం నేరమని ఎస్సై రామకృష్ణారావు హెచ్చరించారు. పోలీస్ శాఖ ఆధ్వర్యంలో జానకిరాంపురం జీడి కర్మాగారంలో మహిళలకు అవగాహన సదస్సు నిర్వహించారు. గంజాయి మత్తులో జరిగే నేరాలు, సైబర్ మోసాల బారిన పడకుండా రక్షణ చర్యలను వివరించారు. మహిళలపై జరుగుతున్న ఘోరాల నియంత్రణకు ప్రతి ఒక్కరూ సహకరించాలని కోరారు.