KDP: మైదుకూరు మున్సిపాలిటీ పరిధిలోని గడ్డమారుపల్లెలో రైతులకు చెందిన వ్యవసాయ మోటార్ల కేబుల్ వైర్లు చోరీకి గురయ్యాయి. సుబ్బరాయుడు, వెంకటసుబ్బయ్య, శారద అనే రైతులకు చెందిన పొలాల్లో దొంగలు కేబుల్ వైర్లు కత్తిరించి ఎత్తుకెళ్లిపోయారని బాధిత రైతులు శుక్రవారం వాపోయారు. ఇటువంటి ఘటనలు జరగకుండా పోలీసులు గట్టి చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.