KRNL: చిప్పగిరి మండలం బంటనహళ్ గ్రామంలో నిర్మాణంలో ఉన్న స్మశానం రోడ్డు పనులు నాసిరకంగా జరుగుతున్నాయనే ఫిర్యాదుల నేపథ్యంలో ఏఈ సోమప్ప ఇవాళ ఆకస్మికంగా పనుల స్థలాన్ని పరిశీలించారు. గ్రామస్థులతో మాట్లాడి పనుల పురోగతి, నాణ్యతపై వివరాలు తెలుసుకున్నారు. పనుల్లో నాణ్యత లోపిస్తే బిల్లులు మంజూరు చేయబోమని కాంట్రాక్టర్ను హెచ్చరించారు.