W.G: భీమవరంలో శనివారం జరిగిన ‘క్లీన్ స్వీప్’ కార్యక్రమంలో కలెక్టర్ చదలవాడ నాగరాణి పాల్గొన్నారు. రైల్వే స్టేషన్ పరిసరాలను శుభ్రం చేసిన కలెక్టర్, పారిశుధ్యం పట్ల ప్రజల్లో అవగాహన పెంచాలని అధికారులను ఆదేశించారు. రద్దీ ప్రాంతాల్లో బహిరంగంగా చెత్త వేసే వారికి జరిమానాలు విధించాలని, ప్లాస్టిక్ వాడకాన్ని తగ్గించి స్టీల్ గ్లాసులను ప్రోత్సహించాలని సూచించారు.