KDP: మీడియా వార్తలు సమాజానికి మార్గదర్శకంగా ఉండాలని, జర్నలిస్టులు సాంకేతిక పరిజ్ఞానానికి అనుగుణంగా తమ నైపుణ్యాలను పెంపొందించుకోవాలని జిల్లా కలెక్టర్ శ్రీధర్ పేర్కొన్నారు. కడప ZP మందిరంలో రాష్ట్ర సీఆర్ మీడియా అకాడమీ ఆధ్వర్యంలో గ్రామీణ విలేకరులకు 2 రోజుల పునశ్చరణ శిక్షణా తరగతులు ప్రారంభమయ్యాయి. ప్రజలకు ఉపయోగపడే వార్తలపై దృష్టి సారించాలని ఆయన పిలుపునిచ్చారు.