BHNG: ప్రభుత్వ పాఠశాలలు, SC, ST, BC, మైనారిటీ రెసిడెన్షియల్ విద్యాలయాల్లో మధ్యాహ్న భోజన పథకాన్ని పకడ్బందీగా అమలు చేయాలని జిల్లా కలెక్టర్ అనురాగ్ జయంతి ఆదేశించారు. విద్యార్థులకు ప్రతిరోజూ పోషకాలతో కూడిన నాణ్యమైన ఆహారాన్ని అందించాలని, దీనిపై ప్రత్యేక అధికారులు నిరంతరం పర్యవేక్షణ జరపాలని సూచించారు. నిబంధనల ప్రకారం భోజన నాణ్యతలో ఎలాంటి లోపాలు ఉండకూడదన్నారు.