AP: పల్నాడు జిల్లా వినుకొండలో సీఎం చంద్రబాబు పర్యటించారు. ఈ సందర్భంగా స్వచ్ఛ రథాలను ఆయన ప్రారంభించారు. ప్రతి మండలానికి ఒక స్వచ్ఛరథం ఏర్పాటు చేసినట్లు తెలిపారు. పాత వస్తువులు ఇస్తే బదులుగా నిత్యావసరాలు ఇస్తామన్నారు. ప్రజలకు స్వచ్ఛమైన గాలి, నీరు ఇవ్వాలనేదే తన ఆలోచన అని పేర్కొన్నారు. ప్రతి ఇంటి దగ్గరకు వచ్చి చెత్తను సేకరిస్తామని వెల్లడించారు.