ప్రకాశం: కనిగిరికి చెందిన వైసీపీ మాజీ ఆస్ట్రేలియా కో ఆర్డినేటర్ చింతల చెరువు సూర్య నారాయణ రెడ్డి బీజేపీలో చేరారు. బీజేపీ జాతీయ కార్యదర్శి బీ.ఎల్.సతీశ్ పార్టీ కండువా కప్పి సాదరంగా ఆహ్వానించారు. ఇటీవల వైసీపీ పదవికి ఆయన రాజీనామ చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. బీజేపీ చేస్తున్న అభివృద్ధిని చూసి ఆ పార్టీలో చేరినట్లు తెలిపారు. పార్టీ బలోపేతం కోసం పనిచేస్తానని అన్నారు.