SRPT: మహిళలు ఎదుర్కొంటున్న సమస్యలపై సంఘటితంగా ఉద్యమించాలని ప్రగతిశీల మహిళా సంఘం జిల్లా ఉపాధ్యక్షురాలు భయ్యం జయమ్మ, సర్పంచ్ సంధ్య అన్నారు. ఆదివారం నాగారం మండలం డి. కొత్తపల్లిలో అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా నిర్వహించిన సభలో పాల్గొని మాట్లాడారు. మోడీ ప్రభుత్వం శ్రామిక వర్గ మహిళలపై పని భారాన్ని మోపుతూ శ్రమ దోపిడీ చేస్తుందని విమర్శించారు.