VZM: మెరకముడిదాం మండలం సర్వసభ్య సమావేశం ఆదివారం ఎంపీడీవో భాస్కరరావు అధ్యక్షతన ఏర్పాటు చేశారు. ఉదయం 11 గంటలకి సమావేశానికి సరిపడే సభ్యులు లేనందున గంట వాయిదా వేశారు. తిరిగి 12 గంటలకు ప్రారంభించినప్పటికీ 16 మంది సభ్యులకు 4 నలుగురు హాజరు కాగా, మిగతా సభ్యులు లేనందున (పంచాయతీరాజ్ చట్టం 1994 ప్రకారం కోరం లేనందున) సమావేశాన్ని ఎంపీడీవో వాయిదా వేశారు.