SDPT: కోహెడ మండల యాదవ సంఘం ఆధ్వర్యంలో ఆదివారం కోహెడలోని శ్రీ మల్లికార్జున స్వామి దేవస్థానంలో మల్లన్న స్వామి పట్నాలు, ఒగ్గు కథల కార్యక్రమం నిర్వహించారు. ఒగ్గు పూజారులు స్వామివారి మహిమలను కథల రూపంలో వినిపించగా భక్తులు భక్తిశ్రద్ధలతో పాల్గొన్నారు. అనంతరం భక్తులకు అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. మండల యాదవ సంఘం అధ్యక్షుడు తదితరులు పాల్గొన్నారు.