NRPT: ఉట్కూరు మండల కేంద్రానికి చెందిన శ్రీరామ మాలధారి ఆదివారం భద్రాచలం క్షేత్రానికి పాదయాత్రగా బయలుదేరారు. స్థానిక ఆంజనేయ స్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు చేసి, ఇరుముడి కట్టుకుని రామనామ స్మరణతో ప్రయాణం ప్రారంభించారు. ఈ సందర్భంగా 14వ వార్డు సభ్యురాలు సువర్ణ రవికుమా, భక్తులు ఆయనకు ఘనంగా వీడ్కోలు పలికారు.