VZM: ఏపీసీసీ అధ్యక్షురాలు YS షర్మిల రెడ్డి మార్చి 15న విజయనగరం జిల్లాకు రానున్నట్లు జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు మరిపి విద్యాసాగర్ తెలిపారు. ఉపాధి హామీ పరిరక్షణ పోరాటంలో భాగంగా మార్చి 15న బొబ్బిలి(మం) పారాది గ్రామం, జామి గ్రామంలో రచ్చబండ కార్యక్రమం జరుపుతున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమానికి నాయకులు, కార్యకర్తలు ప్రజలు పాల్గొనాలని కోరారు.