JN: చిల్పూర్ మండలం కృష్ణాజిగూడెంలో సీపీఎం పార్టీ ఆధ్వర్యంలో వంట గ్యాస్ ధరలను వెంటనే తగ్గించాలని నిరసన చేపట్టారు. సీపీఎం మండల కార్యదర్శి రమేష్ మాట్లాడుతూ.. పెరిగిన వంట గ్యాస్ ధరలను వెంటనే తగ్గించాలని, గ్యాస్ ధరల పెంపుతో పేద, మధ్య తరగతి ప్రజలు ఎంతగానో ఇబ్బందులు పడుతున్నారని అన్నారు. కార్యక్రమంలో పలువురు స్థానిక నేతలు పాల్గొన్నారు.