TG: రాష్ట్రంలో డ్వాక్రా మహిళల హెల్త్ ప్రొఫైలింగ్ కార్యక్రమం ప్రారంభమైంది. ఈ కార్యక్రమానికి మంత్రులు దామోదర రాజనర్సింహ, సీతక్క హాజరయ్యారు. ఇవాళ్టి నుంచి రాష్ట్రవ్యాప్తంగా HPV వ్యాక్సినేషన్ వేయనున్నారు. 14 ఏళ్లు నిండిన 4 లక్షల మంది అమ్మాయిలకు టీకా వేస్తున్నామని మంత్రి సీతక్క తెలిపారు. మహిళలు ఆరోగ్యంగా ఉండాలని ఉచిత హెల్త్ స్క్రీనింగ్ చేస్తున్నామన్నారు.